ETV Bharat / snippets

రాష్ట్రంలో 18 జిల్లాల్లో పంటలకు నష్టం- బీజేపీ కిసాన్​మోర్చా వినతిపత్రం

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 25, 2024, 7:04 PM IST

BJP_Kisanmorcha_on_Crops_Damage
BJP_Kisanmorcha_on_Crops_Damage (ETV Bharat)

BJP Kisanmorcha on Crops Damage: రాష్ట్రంలో గత పది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో దాదాపు 18 జిల్లాల్లో పంటలకు నష్టం వాటిల్లిందని బీజేపీ కిసాన్​మోర్చా ప్రతినిధులు రాష్ట్ర వ్యవసాయశాఖ సంచాలకుడు ఎస్‌.దిల్లీరావుకు వినతిపత్రం అందజేశారు. ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల్లోని లక్ష ఎకరాలపైగా పంటలు దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. వరి, మినుము, పెసర, నువ్వులు, కూరగాయలు, బొప్పాయి, అరటి తదితర పంటలకు పూర్తిగా నష్టం వాటిల్లిందని, వెంటనే పంట నష్టంపై ప్రాథమిక అంచనా వేసి కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపాల్సిందిగా కోరారు. దీంతోపాటు వ్యవసాయ పరికరాలు, ఉద్యాన పంటలకు డ్రిప్‌ ఇరిగేషన్‌ పరికరాలు అందించాలని విజ్ఞప్తి చేశారు. ఆక్వా రైతులు తీవ్ర ఒడిదొడుకులు ఎదుర్కొంటున్నారని, ఈ పరిస్థితుల్లో ఆక్వా జోన్ల విధానాన్ని రద్దు చేయాలని కోరారు.

BJP Kisanmorcha on Crops Damage: రాష్ట్రంలో గత పది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో దాదాపు 18 జిల్లాల్లో పంటలకు నష్టం వాటిల్లిందని బీజేపీ కిసాన్​మోర్చా ప్రతినిధులు రాష్ట్ర వ్యవసాయశాఖ సంచాలకుడు ఎస్‌.దిల్లీరావుకు వినతిపత్రం అందజేశారు. ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల్లోని లక్ష ఎకరాలపైగా పంటలు దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. వరి, మినుము, పెసర, నువ్వులు, కూరగాయలు, బొప్పాయి, అరటి తదితర పంటలకు పూర్తిగా నష్టం వాటిల్లిందని, వెంటనే పంట నష్టంపై ప్రాథమిక అంచనా వేసి కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపాల్సిందిగా కోరారు. దీంతోపాటు వ్యవసాయ పరికరాలు, ఉద్యాన పంటలకు డ్రిప్‌ ఇరిగేషన్‌ పరికరాలు అందించాలని విజ్ఞప్తి చేశారు. ఆక్వా రైతులు తీవ్ర ఒడిదొడుకులు ఎదుర్కొంటున్నారని, ఈ పరిస్థితుల్లో ఆక్వా జోన్ల విధానాన్ని రద్దు చేయాలని కోరారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.