Nandamuri Balakrishna Donation To Telangana CM Relief Fund : రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో తమ సాయం అందించేందుకు దాతలు ముందుకొస్తున్నారు. తాజాగా హైదరాబాద్లో ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.50 లక్షలు విరాళంగా సినీనటుడు నందమూరి బాలకృష్ణ అందించారు. సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని కలిసి బాలకృష్ణ తరఫున ఆయన చిన్న కుమార్తె తేజస్విని చెక్ అందజేశారు.
అలాగే, ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళంగా డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీ యాజమాన్యం 5 కోట్ల రూపాయలు అందించింది. సంస్థ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ వి. నారాయణరెడ్డి ఈ చెక్ను సీఎంకు అందజేశారు. మరోవైపు ఏఎంఆర్ ఇండియా లిమిటెడ్, వెస్టర్న్ కన్ స్ట్రక్షన్స్ సంస్థ చెరో కోటి రూపాయలను విరాళంగా అందించారు. వీరితో పాటు వాక్సెన్ యూనివర్సిటీ వ్యవస్థాపకులు ప్రవీణ్ కె పూల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి రూ.50 లక్షల రూపాయల చెక్ అందజేశారు.