40 Feet Clay Ganapati idol is Immersed in Warangal : వరంగల్ జిల్లాలోని శ్రీ భద్రకాళీ హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఎల్లంబజార్లో ప్రతిష్ఠించిన 40 అడుగుల మట్టి గణపతికి నిమజ్జనం నిర్వహించారు. 15 రోజుల పాటు గణపయ్యకు విశేష పూజలు నిర్వహించారు. చివరి రోజు నిర్వహించిన వేలం పాటలో లడ్డూ రూ.2,26,116 పలికింది. గణపతి ఉత్సవ సమితి సభ్యులు ఫైర్ ఇంజిన్ల సాయంతో స్వామిని ప్రతిష్ఠించిన చోటే నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. స్థానిక పోలీసులు భద్రత ఏర్పాట్లను పర్యవేక్షించారు. నిమజ్జనం నీళ్లను కాలువలోకి మళ్లించడంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రతిష్ఠించిన చోటే 40 అడుగుల మట్టిగణపతికి నిమజ్జనం - భక్తుల ఆగ్రహం
Published : 14 hours ago
40 Feet Clay Ganapati idol is Immersed in Warangal : వరంగల్ జిల్లాలోని శ్రీ భద్రకాళీ హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఎల్లంబజార్లో ప్రతిష్ఠించిన 40 అడుగుల మట్టి గణపతికి నిమజ్జనం నిర్వహించారు. 15 రోజుల పాటు గణపయ్యకు విశేష పూజలు నిర్వహించారు. చివరి రోజు నిర్వహించిన వేలం పాటలో లడ్డూ రూ.2,26,116 పలికింది. గణపతి ఉత్సవ సమితి సభ్యులు ఫైర్ ఇంజిన్ల సాయంతో స్వామిని ప్రతిష్ఠించిన చోటే నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. స్థానిక పోలీసులు భద్రత ఏర్పాట్లను పర్యవేక్షించారు. నిమజ్జనం నీళ్లను కాలువలోకి మళ్లించడంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.