4Kgs Gold Theft in Sangareddy Today : తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాలో భారీ చోరీ జరిగింది. జహీరాబాద్ మండలం సత్వార్ వద్ద ట్రావెల్స్ బస్సులో 4 కిలోల బంగారం చోరీకి గురైంది. హైదరాబాద్ నుంచి ముంబయి వెళ్తున్న బంగారం వ్యాపారి నుంచి దుండగులు చోరీ చేశారు. శుక్రవారం రోజున దాబా వద్ద బస్సు ఆగిన సమయంలో ట్రావెల్స్ బస్సులో చోరీ చేసినట్లు సమాచారం. బాధితుడు చిరాగ్ పల్లి పోలీస్ స్టేషన్లో సమాచారం అందించగా జహీరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రంగంలోకి దిగిన పోలీసులు ధాబాలోని సీసీటీవీ కెమెరాలో నమోదైన దృశ్యాలను చూశారు. వాటి ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరు వ్యక్తులు ఆభరణాలు చోరీ చేసినట్లు సీసీ కెమెరాలో రికార్డయినట్లు పోలీసులు తెలిపారు.
అయ్యో పాపం - చాయ్ తాగుదామని బస్సు దిగితే - 4 కిలోల బంగారం ఎత్తుకెళ్లారు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 27, 2024, 4:15 PM IST
4Kgs Gold Theft in Sangareddy Today : తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాలో భారీ చోరీ జరిగింది. జహీరాబాద్ మండలం సత్వార్ వద్ద ట్రావెల్స్ బస్సులో 4 కిలోల బంగారం చోరీకి గురైంది. హైదరాబాద్ నుంచి ముంబయి వెళ్తున్న బంగారం వ్యాపారి నుంచి దుండగులు చోరీ చేశారు. శుక్రవారం రోజున దాబా వద్ద బస్సు ఆగిన సమయంలో ట్రావెల్స్ బస్సులో చోరీ చేసినట్లు సమాచారం. బాధితుడు చిరాగ్ పల్లి పోలీస్ స్టేషన్లో సమాచారం అందించగా జహీరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రంగంలోకి దిగిన పోలీసులు ధాబాలోని సీసీటీవీ కెమెరాలో నమోదైన దృశ్యాలను చూశారు. వాటి ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరు వ్యక్తులు ఆభరణాలు చోరీ చేసినట్లు సీసీ కెమెరాలో రికార్డయినట్లు పోలీసులు తెలిపారు.