ETV Bharat / snippets

జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండిన వారు ఓటు నమోదు చేసుకోవాలి: ప్రధాన ఎన్నికల అధికారి

author img

By ETV Bharat Telangana Team

Published : Sep 5, 2024, 5:12 PM IST

Telangana Cheif Electoral Officer
TELANAGANA ELECTION COMMISSION (ETV Bharat)

Telangana Cheif Electoral Officer: జనవరి 01, 2024 నాటికి పద్దెనిమిదేళ్లు నిండే వారందరూ ఓటు నమోదు చేసుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సి.సుదర్శన్ రెడ్డి కోరారు. గత నెల 20 న ప్రారంభమైన ఎన్నికల జాబితా ప్రక్రియ కొనసాగుతోందన్నారు. అక్టోబరు 29న ముసాయిదా జాబితా ప్రకటించి, నవంబరు 28 వరకు అభ్యంతరాలను స్వీకరించి, జనవరి 6న తుది జాబితా ప్రచురించనున్నట్లు సీఈవో తెలిపారు.

ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 3 కోట్ల 33 లక్షల 27 వేల 304 మంది ఓటర్లు ఉన్నట్లు పేర్కొన్నారు. ఏప్రిల్ 1 నుంచి ఇప్పటి వరకు 8 లక్షల దరఖాస్తులు రాగా వాటిలో 2 లక్షల 45వేలు పెండింగులో ఉన్నాయని సుదర్శన్ రెడ్డి తెలిపారు. ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బీఎల్ఓలకు శిక్షణ పూర్తయిందన్నారు. ఓటరు కార్డుకు ఆధార్ లింక్​ సుమారు 60శాతం పూర్తయిందని చీఫ్ ఎలక్టోరల్​ ఆఫీసర్​ వెల్లడించారు.

Telangana Cheif Electoral Officer: జనవరి 01, 2024 నాటికి పద్దెనిమిదేళ్లు నిండే వారందరూ ఓటు నమోదు చేసుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సి.సుదర్శన్ రెడ్డి కోరారు. గత నెల 20 న ప్రారంభమైన ఎన్నికల జాబితా ప్రక్రియ కొనసాగుతోందన్నారు. అక్టోబరు 29న ముసాయిదా జాబితా ప్రకటించి, నవంబరు 28 వరకు అభ్యంతరాలను స్వీకరించి, జనవరి 6న తుది జాబితా ప్రచురించనున్నట్లు సీఈవో తెలిపారు.

ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 3 కోట్ల 33 లక్షల 27 వేల 304 మంది ఓటర్లు ఉన్నట్లు పేర్కొన్నారు. ఏప్రిల్ 1 నుంచి ఇప్పటి వరకు 8 లక్షల దరఖాస్తులు రాగా వాటిలో 2 లక్షల 45వేలు పెండింగులో ఉన్నాయని సుదర్శన్ రెడ్డి తెలిపారు. ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బీఎల్ఓలకు శిక్షణ పూర్తయిందన్నారు. ఓటరు కార్డుకు ఆధార్ లింక్​ సుమారు 60శాతం పూర్తయిందని చీఫ్ ఎలక్టోరల్​ ఆఫీసర్​ వెల్లడించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.