Paralympics India 2024: పారిస్ పారాలింపిక్స్లో భారత్ ఖాతాలో రెండో సిల్వర్ మెడల్ చేరింది. సోమవారం జరిగిన పోటీల్లో పారా అథ్లెట్ యోగేశ్ కుతునియా రజతం ముద్దాడాడు. డిస్కస్ త్రోవర్ F56 విభాగంలో పోటీ పడ్డ యోగేశ్ 42.22మీటర్ల ప్రదర్శనతో రెండో స్థానంలో నిలిచాడు. ఈ సీజన్లో యోగేశ్కు ఇదే అత్యత్తమ ప్రదర్శన. కాగా, పారాలింపిక్స్లో సిల్వర్ దక్కించుకోవడం ఇది వరుసగా రెండోసారి. 2020 టోక్యోలోనూ అతడు రజతం ముద్దాడాడు. దీంతో పారిస్ పారాలింరిక్స్లో భారత్ పతకాల సంఖ్య ఎనిమిదికి చేరింది.
పారాలింపిక్స్లో భారాత్కు మరో సిల్వర్- 8కి చేరిన పతకాల సంఖ్య
Published : Sep 2, 2024, 3:06 PM IST
Paralympics India 2024: పారిస్ పారాలింపిక్స్లో భారత్ ఖాతాలో రెండో సిల్వర్ మెడల్ చేరింది. సోమవారం జరిగిన పోటీల్లో పారా అథ్లెట్ యోగేశ్ కుతునియా రజతం ముద్దాడాడు. డిస్కస్ త్రోవర్ F56 విభాగంలో పోటీ పడ్డ యోగేశ్ 42.22మీటర్ల ప్రదర్శనతో రెండో స్థానంలో నిలిచాడు. ఈ సీజన్లో యోగేశ్కు ఇదే అత్యత్తమ ప్రదర్శన. కాగా, పారాలింపిక్స్లో సిల్వర్ దక్కించుకోవడం ఇది వరుసగా రెండోసారి. 2020 టోక్యోలోనూ అతడు రజతం ముద్దాడాడు. దీంతో పారిస్ పారాలింరిక్స్లో భారత్ పతకాల సంఖ్య ఎనిమిదికి చేరింది.