Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్ 2024 తొలి రోజు బ్యాడ్మింటన్లో భారత అథ్లెట్లు శుభారంభం చేశారు. బ్యాడ్మింటన్ సింగిల్స్, డబుల్స్ గ్రూప్ స్టేజ్ మ్యాచ్లో నెగ్గి రెండో రౌండ్కు ఆర్హత సాధించారు. సింగిల్స్ గ్రూప్ స్టేజ్లో స్టార్ షట్లర్ లక్ష్యసేన్ దూకుడుగా ఆడి ప్రత్యర్థిని వరుస సెట్లలో మట్టికరిపించాడు. మ్యాచ్లో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన లక్ష్య 21-08తో మొదటి సెట్ సొంతం చేసుకున్నాడు. ఇక రెండో సెట్లో ప్రత్యర్థి నుంచి కాస్త పోటీ ఎదురైనా 22-20తేడాతో నెగ్గి రెండో రౌండ్కు దూసుకెళ్లాడు.
మరోవైపు పురుషుల డబుల్స్లో సాత్విక్- చిరాగ్ కూడా ఆదరగొట్టారు. ఈ జోడీ తొలి రౌండ్లో ఫ్రెంచ్ ద్వయం లుకస్- రోనమ్ను 21-17, 21-14 వరస సెట్లలో ఓడించింది. కాగా, జులై 29న అటు సింగిల్ ఈవెంట్లో లక్ష్యసేన్, డబుల్స్లో సాత్విక్- చిరాగ్ రెండో రౌండ్ ఆడనున్నారు. అంతకుముందు మనూ బాకర్ (షూటింగ్), హర్మీత్ (టెబుల్ టెన్నిస్) శుభారంభం చేశారు.