4 Maiden Overs In T20s: హాంకాంగ్ బౌలర్ ఆయుశ్ శుక్లా టీ20 క్రికెట్లో సంచలనం సృష్టించాడు. తన నాలుగు ఓవర్ల కోటాలో ఒక్క పరుగు ఇవ్వకుండా అన్నింటిని మెయిడెన్లుగా మలిచి అరుదైన ఘనత సాధించాడు. ఐసీసీ టీ20 వరల్డ్కప్ క్వాలిఫైయింగ్లో ఆదివారం మంగోలియాతో జరిగిన మ్యాచ్లో ఆయూశ్ ఈ ఫీట్ సాధించాడు. ఈ మ్యాచ్లో ఆయుశ్ నాలుగు ఓవర్లు వేసి ఒక్క పరుగు ఇవ్వకుండా 1 వికెట్ దక్కించుకున్నాడు.
కాగా, వరల్డ్వైడ్గా ఈ ఫీట్ సాధించిన మూడో బౌలర్గా ఆయుశ్ నిలిచాడు. అతడి కంటే ముందు న్యూజిలాండ్ పేసర్ లాకీ ఫెర్గ్యూసన్ (vs పపువా న్యూ గినియా, వరల్డ్కప్), కెనడా బౌలర్ సాద్ బిన్ జఫర్ (vs పనామా) ముందు ఈ ఫీట్ సాధించారు. అయితే ఈ ఫీట్ సాధించిన తొలి ఆసియా బౌలర్ మాత్రం ఆయుశే కావడం విశేషం.