Rashmika Mandanna VD 14 : పుష్ప సినిమాలో శ్రీ వల్లీ పాత్రను చూసిన ఎవ్వరైనా సరే ఆ రోల్కు ఆమే కరెక్ట్ ఛాయిస్ అని అంటుంటారు. అంతలా ఆ పాత్రలో ఒదిగిపోయింది నటి రష్మిక మందన్న. ఓ వైపు యాక్టింగ్తో అదరగొడుతూనే మరోవైపు రాయలసీమ యాశలోనూ అంతే బాగా మాట్లాడింది. 'పుష్ప 2'లోనూ మళ్లీ అదే పాత్రలతో సందడి చేసేందుకు సిద్ధంగా ఉంది. అయితే తాజాగా రష్మిక గురించి ఓ వార్త నెట్టింట తెగ్ ట్రెండ్ అవుతోంది. 'పుష్ప2' తర్వాత మరోసారి సీమ యాస మాట్లాడే ఓ పాత్రలో నటించనుందట ఈ అమ్మడు.
విజయ్ దేవరకొండ, రాహుల్ సంకృత్యాన్ కాంబోలో తెరకెక్కనున్న పీరియాడిక్ డ్రామాలో హీరోయిన్గా రష్మికను తీసుకునేందుకు ప్లాన్లో ఉన్నారట. తన పాత్ర దాదాపు ఖాయమైనట్టే అని సమాచారం. ఇది పూర్తిగా రాయలసీమలోని కర్నూలు నేపథ్యంలో సాగే కథ గనుక రష్మిక మరోసారి సీమ యాసలో మాట్లాడనున్నట్లు సమాచారం.