Double Ismart: రామ్ పోతినేని మాస్ ఎంటర్టైనర్ 'డబుల్ ఇస్మార్ట్' సినిమా షూటింగ్ పూర్తైనట్లు మూవీటీమ్ తెలిపింది. స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఈ సినిమాను 'ఇస్మార్ట్ శంకర్'కు సీక్వెల్గా తెరకెక్కించారు. 'డబుల్ ఇస్మార్ట్ షూట్ పూర్తైంది. దిమాక్ కిరికిరిని ఆగస్టు 15న థియేటర్లలో ఎక్స్పీపియన్స్ చేయండి' అని సోషల్ మీడియాలో మూవీటీమ్ ఓ పోస్ట్ చేసింది. ఇక షూటింగ్ కంప్లీట్ అవ్వడం వల్ల సినిమా మేకర్స్ ప్రోమోషన్లలో జోరు పెంచనున్నారు. త్వరలోనే ప్రమోషన్స్ ప్రారంభం కానున్నాయి.
కాగా, ఇప్పటికే రిలీజైన టీజర్, 'స్టెప్పామార్' పాటకు ఫుల్ పాజిటివ్ రెస్పాన్స్ లభించింది. యూట్యూబ్లో ఫస్ట్ సాంగ్ ట్రెండింగ్లో దూసుకుపోతోంది. ఈ సినిమాలో కావ్యా థాపర్ హీరోయిన్గా నటించగా, బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ కీలక పాత్ర పోషించారు. ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తుండగా, చార్మితో కలిసి దర్శకుడు పూరి జగన్నాధ్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.