ETV Bharat / snippets

యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం - డబుల్ డెక్కర్​ బస్సు, కారు ఢీ - ఏడుగురు మృతి

author img

By ETV Bharat Telugu Team

Published : Aug 4, 2024, 8:23 AM IST

UP Accident 7 Killed
UP Accident 7 Killed (ANI)

UP Accident 7 Killed : ఉత్తరప్రదేశ్​లోని ఆగ్రా-లఖ్​నవూ ఎక్స్​ప్రెస్​ వేలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. డబుల్​ డెక్కర్ బస్సు, ఓ కారును ఢీకొనడంతో ఏడుగురు వ్యక్తులు మృతి చెందారు. మరో 25 మంది తీవ్రంగా గాయపడ్డారు. "రాయ్​బరేలీ నుంచి దిల్లీ వెళ్తున్న బస్సు రాత్రి సుమారుగా 12.45 గంటల సమయంలో, ఓ కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులోని నలుగురు, కారులోని ముగ్గురు వ్యక్తులు మరణించారు. గాయపడిన వారికి సమీపంలోని ఆసుపత్రికి తరలించాం. ప్రమాదంలో చిక్కుకున్న కారు లఖ్​నవూ నుంచి ఆగ్రాకు వస్తోంది. అయితే కారు డ్రైవర్​ నిద్ర మత్తులో రాంగ్​ రూట్​లోకి రావడం వల్లనే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది" అని పోలీసులు తెలిపారు.

UP Accident 7 Killed : ఉత్తరప్రదేశ్​లోని ఆగ్రా-లఖ్​నవూ ఎక్స్​ప్రెస్​ వేలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. డబుల్​ డెక్కర్ బస్సు, ఓ కారును ఢీకొనడంతో ఏడుగురు వ్యక్తులు మృతి చెందారు. మరో 25 మంది తీవ్రంగా గాయపడ్డారు. "రాయ్​బరేలీ నుంచి దిల్లీ వెళ్తున్న బస్సు రాత్రి సుమారుగా 12.45 గంటల సమయంలో, ఓ కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులోని నలుగురు, కారులోని ముగ్గురు వ్యక్తులు మరణించారు. గాయపడిన వారికి సమీపంలోని ఆసుపత్రికి తరలించాం. ప్రమాదంలో చిక్కుకున్న కారు లఖ్​నవూ నుంచి ఆగ్రాకు వస్తోంది. అయితే కారు డ్రైవర్​ నిద్ర మత్తులో రాంగ్​ రూట్​లోకి రావడం వల్లనే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది" అని పోలీసులు తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.