ETV Bharat / snippets

ఒక్కసారిగా కూలిన చెరువు గట్టు- అక్కడే కూర్చున్న ఏడుగురు యువకులు మృతి

author img

By ETV Bharat Telugu Team

Published : Aug 11, 2024, 4:06 PM IST

Pond Collapsed Today
Pond Collapsed Today (ETV Bharat)

Pond Collapsed Today : రాజస్థాన్​లోని భరత్​పుర్ జిల్లాలో చెరువు ఒడ్డున కూర్చుని నీటి ప్రవాహన్ని చూస్తున్న ఏడుగురు యువకులు అక్కడికక్కడే మరణించారు. చెరువు గట్టు ఒక్కసారిగా కూలిపోవడం వల్ల మట్టి కింద చిక్కుకుని చనిపోయారు. ఆదివారం జరిగిన ఈ ఘటనతో గ్రామమంతా విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుల కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

నాగ్లా హోట్టా గ్రామ శివార్లలో ఉన్న చెరువు ఒడ్డున కూర్చుని పలువురు యువకులు నీటి ప్రవాహాన్ని చూశారు. అదే సమయంలో కొంత భాగం గట్టు కూలిపోవడం వల్ల యువకులంతా చెరువులో పడిపోయారు. వారి కేకలు విన్న స్థానికులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కానీ అప్పటికే మట్టి కింద కూరుకుపోయి ఏడుగురు మరణించారు. చెరువు వద్దకు చేరుకుని యువకుల మృతదేహాలను స్థానికుల సహాయంతో పోలీసులు బయటకు తీశారు. మృతులను గుర్తించారు.

Pond Collapsed Today : రాజస్థాన్​లోని భరత్​పుర్ జిల్లాలో చెరువు ఒడ్డున కూర్చుని నీటి ప్రవాహన్ని చూస్తున్న ఏడుగురు యువకులు అక్కడికక్కడే మరణించారు. చెరువు గట్టు ఒక్కసారిగా కూలిపోవడం వల్ల మట్టి కింద చిక్కుకుని చనిపోయారు. ఆదివారం జరిగిన ఈ ఘటనతో గ్రామమంతా విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుల కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

నాగ్లా హోట్టా గ్రామ శివార్లలో ఉన్న చెరువు ఒడ్డున కూర్చుని పలువురు యువకులు నీటి ప్రవాహాన్ని చూశారు. అదే సమయంలో కొంత భాగం గట్టు కూలిపోవడం వల్ల యువకులంతా చెరువులో పడిపోయారు. వారి కేకలు విన్న స్థానికులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కానీ అప్పటికే మట్టి కింద కూరుకుపోయి ఏడుగురు మరణించారు. చెరువు వద్దకు చేరుకుని యువకుల మృతదేహాలను స్థానికుల సహాయంతో పోలీసులు బయటకు తీశారు. మృతులను గుర్తించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.