NEET UG Counselling 2024 : వైద్యవిద్యా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించాల్సిన నీట్ యూజీ కౌన్సిలింగ్ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) వాయిదా వేసింది. శనివారం నుంచి కౌన్సిలింగ్ జరగాల్సి ఉండగా తదుపరి ప్రకటన వచ్చే వరకు వాయిదా వేస్తున్నట్లు ఎన్టీఏ ప్రకటించింది. కొత్త తేదీలను కేంద్ర విద్యాశాఖ త్వరలోనే ప్రకటిస్తుందని తెలిపింది. దీనిపై గతంలో నీట్ కౌన్సిలింగ్ను వాయిదా వేయాలని పలువురు సుప్రీం కోర్టును ఆశ్రయింగా, అందుకు నిరాకరించింది. నీట్ నిర్వహణ తీరుపై జులై 8న తదుపరి విచారణ జరగనుంది. ఈ పరిణామాల వేళ ఎన్టీఏ కౌన్సెలింగ్ను వాయిదా వేయడం గమనార్హం.
ఇటీవల నీట్ యూజీ పరీక్షలో పేపర్ లీకేజీలు, గ్రేస్ మార్కుల వ్యవహారంతో ఆందోళన వ్యక్తమయ్యాయి. దీంతో దేశవ్యాప్తంగా విద్యార్థి సంఘాలు, నేతలు నిరసన వ్యక్తం చేశారు. ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేస్తోంది. ఇప్పటికే పేపర్ లీక్కు సంబంధించి పలువురుని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.