Four Terrorists Have Been Killed In Jammu And Kashmir : జమ్ము కశ్మీర్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. భద్రతా బలగాల చేతిలో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. మరో నలుగురు ఉగ్రవాదులు దాక్కున్నట్లు అనుమానిస్తున్నారు. అయితే ఈ ఎన్కౌంటర్లో ఇద్దరు సైనికులు వీరమరణం పొందారు.
కుల్గాం జిల్లాలోని ఫ్రిసల్ చిన్నిగాం, మోడెర్గాం గ్రామాల్లో ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారం ఆధారంగా, భద్రతాబలగాలు కార్డెన్సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. దీనితో ఎదురుకాల్పులు ప్రారంభమయ్యాయి. మోర్గాంలోని ఓ ఇంటి వద్దకు వెళ్లిన సైన్యం, సీఆర్పీఎఫ్ బలగాలపై ముష్కరులు భారీస్థాయిలో కాల్పులు జరపగా, ఓ సైనికుడు వీరమరణం పొందారు. ఫ్రిసల్ చిన్నిగాంలో జరిగిన మరో భారీ ఎన్కౌంటర్లో సైన్యం నలుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టగా, ఓ సైనికుడు అమరుడయ్యారు. ఆ రెండు చోట్లా ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని సైనికాధికారులు తెలిపారు.