మంత్రి సోదరుడి నుంచి రక్షణ కల్పించండి - ఎస్పీకి బాధితుడి ఫిర్యాదు - Kurnool SP
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 8, 2024, 9:22 PM IST
Complaint against Gummanur Narayanaswamy: కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం సోదరుడు నారాయణస్వామి బెదిరింపులకు పాల్పడుతున్నారంటూ, కర్నూలు జిల్లా ఆస్పరి మండలం జెడ్పీటీసీ దొరబాబు ఆరోపించారు. ఈ మేరకూ నారాయణస్వామిపై కర్నూలు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. మంత్రి సోదరుడు నారాయణస్వామి నుంచి తనకు ప్రాణహాని ఉందని దొరబాబు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. కర్నూలు ఎస్పీ కార్యాలయానికి తన అనుచరులతో వచ్చిన దొరబాబు, మంత్రి సోదరుడు నారాయణ స్వామి నుంచి తనను కాపాడాలని ఎస్పీని కోరారు. ఈనెల 6వ తేదీన తనకు ఫోన్ చేశారని, ఫోన్ లోనే నారాయణస్వామి తనను బెదిరించాడని ఆరోపించారు. ఎన్నికల అనంతరం హత్య చేస్తామని బెదిరించారని దొరబాబు తెలిపారు. నారాయణస్వామి నుంచి పోలీసులే తనకు రక్షణ కల్పించాలని కోరారు. దొరబాబు ఆలూరు నియెజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త విరూపాక్షకు ప్రధాన అనుచరుడుగా కొనసాగుతున్నారు.
ఆలూరు నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త విరూపాక్షను నియమించడంతో, ఆయన వెంట పలువురి ఎంపీటీసీలు, జడ్పీటీసీలు ప్రచారానికి వెళ్తున్నారు. విరూపాక్షను ఆలూరు సమన్వయ కర్తగా నియమించడంపై గుర్రుగా ఉన్న జయరాం ఆగ్రహంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో విరూపాక్షతో ప్రచారంలో పాల్గొంటున్న సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీలపై ఆగ్రహంగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా మంత్రి సోదరుడు జడ్పీటీసీని తిట్టిన ఆడియో వైరల్గా మారడంతో తనకు రక్షణ కల్పించాలంటూ దొరబాబు జిల్లా ఎస్పీని ఆశ్రయించాడు.