వైఎస్సార్సీపీలో బీసీలకు విలువలేదు- పార్టీలో కొనసాగడంపై ఆలోచించుకుంటా : ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి - YSRCP MLC
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/09-02-2024/640-480-20706762-thumbnail-16x9-ysrcp-mlc-janga-krishnamurthy-spiritual-meeting.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 9, 2024, 12:29 PM IST
YSRCP MLC Janga Krishnamurthy Spiritual Meeting : ఎన్నికల తరువాత 4 సంవత్సరాల నుంచి ప్రభుత్వం తనను ఏ కార్యక్రమాలకు పిలవలేదని వైఎస్సార్సీపీ ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో ఆయన ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. పేద కుటుంబానికి చెందిన తనని ఇంతగా ఆదరించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీలో కొనసాగాలా లేదా అని నిర్ణయించుకోవటానికే ఈ సమావేశమని జంగా పేర్కొన్నారు.
వైఎస్సార్సీపీ గెలుపు కోసం పని చేసిన వారిని పక్కన పెట్టారని జంగా కృష్ణమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. గామాలపాడులో ఆసరా కార్యక్రమానికి సర్పంచ్ అయిన తన కుమారుడికి కనీసం సమాచారం ఇవ్వలేదని అన్నారు. వైఎస్సార్సీపీ కౌన్సిలర్ని పోలీస్ స్టేషన్లో కొట్టించడం ఏమిటని ప్రశ్నించారు. పార్టీ కోసం బీసీ వర్గాల కోసం రాష్ట్ర మంతటా పాదయాత్ర చేశానని అన్నారు. బీసీ సామాజిక వర్గంపై దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. నేడు నియోజకవర్గ పరిస్థితి దృష్ట్యా చాలా బాధగా ఉందని విచారం వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ పెద్దల దృష్టికి తీసుకువెళ్ళినా ఏ ప్రయోజనం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.