అధికార పార్టీ ఎమ్మెల్యేలంతా మాఫియా బ్యాచ్- టీడీపీలో చేరిన వైసీపీ యువనేత - ycp Youth State Secretary resined - YCP YOUTH STATE SECRETARY RESINED

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 2, 2024, 8:10 PM IST

YCP Youth State Secretary Resined to Party : రాష్ట్రంలో ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్ది వైసీపీ పార్టీకి ముఖ్యనేతలు, కార్యకర్తలు ఒక్కొక్కరుగా రాజీనామాలు చేస్తున్నారు. తాజాగా వైసీపీ యువజన రాష్ట్ర కార్యదర్శి పదవికి శశిధర్ రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారు. అనంతరం వైఎస్సార్ జిల్లా మైదుకూరు కూటమి అభ్యర్థి పుట్టా సుధాకర్‌ యాదవ్‌ సమక్షంలో శశిధర్ ఈరోజు టీడీపీలో చేరారు. తరువాత మైదుకూరు పట్టణంలో సుధాకర్​తో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా శశిధర్ రెడ్డి మాట్లాడుతూ, గత ఎన్నికల ముందు వైసీపీ అధికారంలోకి రావడం కోసం ఎంతో కష్టపడ్డానని తెలిపారు. తీర అధికారంలోకి వచ్చాక పార్టీలో సరైన గౌరవం దక్కలేదని మండిపడ్డారు. ఏడేళ్ల పాటు పార్టీ కోసం కష్టపడితే దాకిని బహుమతిగా వైసీపీ నాయకులు రూ.1.20 కోట్లతో నిర్మించుకున్న సోంత ఇంటిని ఆక్రమించుకున్నారని శశిధర్ రెడ్డి ఆరోపించారు. 

ఎమ్మెల్యే రఘరామి రెడ్డికి తాను ఇళ్లు ఇవ్వలేదని, ఇవ్వను అని కూడా చెప్పినట్లు పేర్కొన్నారు. అయిన అధికార బలంతో కుట్రలు చేసి అన్యాయంగా తన ఇంటిని ఆక్రమించుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆ ఇంటిలో కూర్చోని రఘరామి రెడ్డి రాజకీయం నడుపుతున్నారని మండిపడ్డారు. కష్టపడి కట్టుకున్న ఇంటి పునదుల్లో మా కుటుంబసభ్యుల రక్తం, చెమట ఉందని తెలిపారు. రాష్ట్రంలోని ఎమ్మెల్యేలందరూ మాఫియా బ్యాచ్​గా తయారయ్యారని ఎద్దేవ చేశారు. జగన్ మోహన్‌రెడ్డితో నేరుగా సంబంధాలు కలిగిన నాయకులు కూడా నేడు పార్టీకి దూరంగా ఉన్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కష్టపడి పనిచేసిన నాయకులకు వైసీపీ పార్టీ తీరని అన్యాయం చేసిందని శశిధర్ రెడ్డి వాపోయారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.