వైసీపీని వీడుతున్న నేతలు- టీడీపీలోకి వందల కుటుంబాల చేరికలు - Joining From YCP to TDP Increasing - JOINING FROM YCP TO TDP INCREASING
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 23, 2024, 9:05 PM IST
YCP Leaders Joining in TDP: ఎన్నికలు సమీపించేకొద్దీ రాష్ట్ర వ్యాప్తంగా పలు నియోజకవర్గాల్లో అధికార వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయి. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో 100 గిరిజన కుటుంబాలకు చెందిన 300 మంది వైసీపీని వీడి టీడీపీలో చేరారు. టీడీపీ అభ్యర్థి రాజగోపాల్ తాతయ్య నివాసంలో రాష్ట్ర గిరిజన కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ సిమ్మసర్తి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో టీడీపీ గూటికి చేరారు. ప్రకాశం జిల్లా సంతనూతలపాడు మండలంలోని చిలకపాడు గ్రామ సర్పంచ్ బోలినేని మధు వైసీపీని వీడి తెలుగుదేశంలో చేరారు. వైసీపీ సీనియర్ నేత కోక చిన్నారావు ఆధ్వర్యంలో 70 కుటుంబాలతో కలిసి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.
సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గంలో అధికార వైసీపీకి భారీ షాక్ తగిలింది. ఒడిసి మండలం కొండకమర్లలో 200 కుటుంబాలు వైసీపీని వీడి సైకిలెక్కాయి. మాజీ మంత్రి పల్లె రఘునాథ్రెడ్డి వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వైఎస్సార్ జిల్లా వేంపల్లికి చెందిన 20 మాజీ సైనికుల కుటుంబాలు టీడీపీలో చేరాయి. పులివెందుల టీడీపీ అభ్యర్థి బీటెక్ రవి వారిని పార్టీలోకి ఆహ్వానించారు.