అడ్డతీగల పోలీస్స్టేషన్ ఎదుట ఉద్రిక్తత - టీడీపీ కార్యకర్తపై ఎమ్మెల్సీ అనంతబాబు అనుచరుల దాడి - YCP Activsts Attack on TDP - YCP ACTIVSTS ATTACK ON TDP
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10-05-2024/640-480-21438841-thumbnail-16x9-ycp-leader-ananthababu.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : May 10, 2024, 10:54 PM IST
YCP Leader Ananthababu Activists Attack on TDP Activist: పోలింగ్ సమయం సమీపిస్తున్న తరుణంలో వైఎస్సార్సీపీ కార్యకర్తలు టీడీపీ నేతలపై దాడులకు పాల్పడుతున్నారు. అల్లూరు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం ఎల్లవరంలో తెలుగుదేశం కార్యకర్త మిరియాల రాజుపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ అనంతబాబు అనుచరులు దాడి చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా అడ్డతీగల నుంచి ఎల్లవరం వెళ్తుండగా వర్షం కారణంగా కిందపడిపోయిన వైఎస్సార్సీపీ ఫ్లెక్సీని తీసి పక్కన పెడుతున్న తెలుగుదేశం కార్యకర్తపై అనంతబాబు అనుచరులు దాడి చేసి గాయపరిచారు.
అంతటితో ఆగకుండా పోలీసులకు ఫిర్యాదు చేసి అతన్ని స్టేషన్లో పెట్టించారు. ఈ విషయం తెలుసుకున్న టీడీపీ కార్యకర్తలు అడ్డతీగల పోలీస్ స్టేషన్ ఎదుట భైఠాయించి ఆందోళనకు దిగారు. దాడి చేసిన వైఎస్సార్సీపీ కార్యకర్తలపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అసలు జరిగిందేమిటో కూడా తెలుసుకోకుండా దాడికి పాల్పడటం చాలా దారుణమని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ దాడి కారణంగా ప్రస్తుతం అడ్డతీగల పోలీస్ స్టేషన్ ఎదుట ఉద్రికత్త వాతావరణం నెలకొంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.