thumbnail

పెనుమర్రులో రెచ్చిపోయిన వైసీపీ కార్యకర్త- ప్రచార ఏర్పాట్లను వీడియో తీస్తున్న ఫొటోగ్రాఫర్‌పై దాడి - YCP ACTIVIST ATTACK

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 8, 2024, 1:33 PM IST

YCP Activist Attacked A Photographer in Penumarru: ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైసీపీ రౌడీ రాజకీయాలకు తెరలేపుతోంది. సామాన్య ప్రజలపై వైసీపీ నేతల దాడులు చేస్తున్నారు. ఎన్నికల ప్రచార ఏర్పాట్లను వీడియో తీస్తున్న ఫొటోగ్రాఫర్‌పై వైసీపీ కార్యకర్త దాడికి పాల్పడ్డ ఘటన పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలో చోటుచేసుకుంది. వైసీపీ అభ్యర్థి గుడాల గోపాలరావు యలమంచిలి మండలం పెనుమర్రులో ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఈ ప్రక్రియను ఎన్నికల అధికారి సీతారామరాజు ఆధ్వర్యంలో శ్రీనివాస్‌ అనే ఫొటోగ్రాఫర్‌ వీడియో తీస్తున్నారు. 

వీడియో తీయడంపై రెచ్చిపోయిన వైసీపీ కార్యకర్తలు ఒక్కసారిగా అతడిపై దాడికి పాల్పడ్డారు. ముఖంపై పిడిగుద్దులు, ఇటుకలతో దాడి చేయడంతో శ్రీనివాస్‌ సొమ్మసిల్లి పడిపోయారు. అడ్డుకోబోయిన ఎన్నికల అధికారి పట్ల వైసీపీ కార్యకర్తలు దురుసుగా ప్రవర్తించారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ప్రస్తుతం వైసీపీ మూకదాడిలో అమాయకులైన ప్రజలు బలైపోతున్నారు. అధికారం ఉందనే చెలామణితో రెచ్చిపోయి మరీ ప్రతిపక్ష నేతలపై కూడా దాడులకు దిగి వారి వాహనాలను సైతం ధ్వంసం చేస్తున్నారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.