నీళ్లివ్వలేని ప్రభుత్వం ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే - తాగునీటి కోసం మహిళల ఆందోళన - విజయవాడ తాజా
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/24-01-2024/640-480-20581087-thumbnail-16x9-women-protest-for-drinking-water-in-vijayawada.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 24, 2024, 1:13 PM IST
Women Protest For Drinking Water in Vijayawada : విజయవాడ శివారు రాజీవ్ నగర్ ప్రాంతంలో గత 15 రోజులుగా తాగునీరు రావడం లేదని మహిళలు ఖాళీ బిందెలతో ఆందోళకు దిగారు. నీళ్లు రాకపోవడంతో సొంత డబ్బుతో ట్యాంకర్లు ఏర్పాటు చేసుకున్నామని స్థానిక మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు కుంటి సాకులు చెబుతూ నీటి సరఫరా నిలిపివేయటం దారుణమని సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సీహెచ్. బాబురావు ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యే (MLA) టికెట్ కోసం వైఎస్సార్సీపీ నాయకులు పోటీ పడటం మానేసి ప్రజల సమస్యలను పట్టించుకోవాలని వారు కోరారు.
పక్షం రోజులుగా నీరు లేకపోవడంతో తాము చాలా ఇబ్బందులు పడుతున్నామని, సంక్రాంతి పండుగ అప్పుడు కూడా నీటి సరఫరా లేకపోవడంతో కనీస పనులు చేసుకోవడం, ఇంటిపని, వంట పనులకూ నీరు లేదని మహిళలు తెలిపారు. ఆందోళన జరుగుతున్న ప్రాంతానికి మున్సిపల్ శాఖ అధికారులు చేరుకున్నారు. దీంతో స్థానిక మహిళలు వారిని నిలదీయగా మరో రెండు రోజుల్లో నీటి సరఫరా పునరుద్ధరిస్తామని అధికారులు చెప్పారు. దీంతో మహిళలు ఆందోళన విరమించారు.