సాధారణ ప్రసవం - ఒకే కాన్పులో ముగ్గురు ఆడపిల్లలు జననం

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 26, 2024, 7:11 PM IST

thumbnail

Women Gave Birth to Three Baby Girls in Normal Delivery : అనంతరం జిల్లా కళ్యాణదుర్గం ఆర్డీటీ ఆసుపత్రిలో ఓ మహిళ సాధారణ ప్రసవంలో ముగ్గురు ఆడ పిల్లలకు జన్మనిచ్చింది. కళ్యాణదుర్గం మండలం మల్లికార్జునపల్లి గ్రామానికి చెందిన లక్ష్మీదేవి ఆర్డీటి ఆసుపత్రికి కాన్పు కోసం రాగా వైద్యులు ఆమెకు సిజేరియన్​ లేకుండానే కాన్పు చేశారు. ఆ మహిళ ఆరోగ్యవంతమైన ముగ్గురు ఆడపిల్లలకు జన్మనిచ్చిందని వైద్యులు  తెలిపారు. ఇప్పటికే లక్ష్మీదేవి, గణేష్ దంపతులకు నాలుగేళ్ల పాప ఉండగా రెండో కాన్పులో ముగ్గురు ఆడ పిల్లలకు జన్మించారు. ఈ వార్త తెలుసుకుని బంధువులు వారిని చూసేందుకు తరలి వస్తున్నారు.  

Three Baby Girls in Normal Delivery : ఒకే కాన్పులో ముగ్గురు మహాలక్ష్ములు పుట్టారని బంధువులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ముగ్గురు బిడ్డలు సాధారణ ప్రసవం ద్వారా పుట్టడం, వారంతా మంచి ఆరోగ్యం కలిగి ఉండటం పట్ల ఆస్పత్రి యాజమాన్యం హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.