'ఎమ్మెల్యే గో బ్యాక్'- అదీప్ రాజ్కు నిరసన సెగ - ఎమ్మెల్యే అదీప్ రాజ్కు నిరసన సెగ
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 30, 2024, 7:04 PM IST
Villagers Against To Pendurthi MLA Adeep Raj in Anakapally District : పెందుర్తి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే (MLA) అదీప్ రాజ్కు నిరసన సెగ తగిలింది. అనకాపల్లి జిల్లా అప్పికొండలో సీసీ రోడ్డు శంకుస్థాపనకు వచ్చిన ఎమ్మెల్యేను గ్రామస్థులు అడ్డుకున్నారు. 77 వ వార్డు పరిధిలో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని ప్రజలు మండిపడ్డారు. ఐదేళ్లలో ఏనాడూ ఇటు వైపు రాలేదని అసంతృప్తి వెళ్లగక్కారు. అదీప్ రాజ్ కారుకు అడ్డంగా బైఠాయించి 'ఎమ్మెల్యే గో బ్యాక్' అంటూ నినాదాలు చేశారు.
ఎమ్మెల్యే అనుచరులు, స్థానిక నాయకులు, పోలీసులు నచ్చజెప్పేందుకు యత్నించడంతో గ్రామస్థులు వారితో వాగ్వాదానికి దిగారు. ఇదంతా చూసిన ఎమ్మెల్యే అక్కడి నుంచి వెనుదిరిగారు. ఓట్ల కోసం దండాలు పెడుతూ ఇంటింటికీ తిరిగిన ఎమ్మెల్యే ఇప్పుడు కనీసం కారు దిగకుండా వెళ్లిపోయారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐదేళ్లుగా గుర్తుకు లేని ప్రజలు ఇప్పుడు గుర్తుకొచ్చారా అంటూ గ్రామస్థులు మండిపడ్డారు. మళ్లీ ఓట్లు అడుక్కోవడానికి వస్తున్నారా అంటూ ఆందోళన వ్యక్తం చేశారు.