LIVE : సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి బోనాలు- ప్రత్యక్ష ప్రసారం - Secunderabad Laskar Bonalu Live - SECUNDERABAD LASKAR BONALU LIVE
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 21, 2024, 7:30 AM IST
|Updated : Jul 21, 2024, 1:44 PM IST
Secunderabad Ujjaini Mahankali Bonalu 2024 Live : లష్కర్ బోనాలతో సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయం సందడిగా మారింది. తెల్లవారుజాము నుంచే తరలివస్తున్న భక్తులతో ఆలయ పరిసరాల్లో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరుస్తోంది. తెల్లవారుజామునే హైదరాబాద్ ఇంచార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ కుటుంబ సమేతంగా అమ్మవారికి తొలిబోనం సమర్పించారు. తెల్లవారుజామున అమ్మవారికి మహా హారతి, కుంకుమ, పుష్ప అర్చనలు నిర్వహించారు. సాకలు సమర్పించి విశేష నివేదన చేశారు. మహంకాళి అమ్మవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఈ సందర్భంగా హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దూరిశెట్టి ఏర్పాట్లను పర్యావేక్షించారు. రైతులు పాడిపంటలతో సమృద్ధిగా ఉండాలని అమ్మవారిని ఆకాంక్షించినట్లు మంత్రి పొన్నం తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహంకాళి బోనాలను రాష్ట్ర పండుగగా గుర్తించి వైభవంగా నిర్వహిస్తుందన్నారు. అమ్మవారి బోనాన్ని అలంకరించి అంగరంగ వైభవంగా ఉత్సవాలను ప్రారంభించినట్లు తెలిపారు.అందులో భాగంగా నేడు తొలి బోనాన్ని అమ్మవారికి సమర్పించానని వెల్లడించారు. తెల్లవారుజామున 3 గంటల నుంచే ఇక్కడ బోనం సమర్పించడానికి భక్తులు అందరూ వస్తారని పేర్కొన్నారు.
Last Updated : Jul 21, 2024, 1:44 PM IST