By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 29, 2024, 12:51 PM IST
కర్ణాటకలో రోడ్డు ప్రమాదం- ముగ్గురు ఏపీ వాసులు మృతి - Chintamani Road Accident Today
Chintamani Road Accident Today : కర్ణాటకలోని చింతామణి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టెంపోను కారు ఢీకొట్టడంతో ముగ్గురు అక్కడిక్కడే మృతి చెందారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతులు ఏపీ చెందిన వారిగా గుర్తించారు. నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం చుంచులూరు వాసులని పోలీసులు పేర్కొన్నారు.
Three AP People Died in Karnataka : ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మరణించారని పోలీసులు తెలిపారు. మృతులు బొటిక శ్రీనివాసులు, భార్య పుష్ప, కొడుకు శ్రీకాంత్గా గుర్తించామని చెప్పారు. బెంగళూరు నుంచి చుంచులూరులో ఓ వివాహానికి హాజరయ్యేందుకు వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుందని పేర్కొన్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉందని చెప్పారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. మృతదేహాలను పోస్ట్మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని పోలీసులు వెల్లడించారు. రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందడంతో చుంచులూరు గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.