thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 29, 2024, 12:51 PM IST

ETV Bharat / Videos

కర్ణాటకలో రోడ్డు ప్రమాదం- ముగ్గురు ఏపీ వాసులు మృతి - Chintamani Road Accident Today

Chintamani Road Accident Today : కర్ణాటకలోని చింతామణి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టెంపోను కారు ఢీకొట్టడంతో ముగ్గురు అక్కడిక్కడే మృతి చెందారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతులు ఏపీ చెందిన వారిగా గుర్తించారు. నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం చుంచులూరు వాసులని పోలీసులు పేర్కొన్నారు.

Three AP People Died in Karnataka : ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మరణించారని పోలీసులు తెలిపారు. మృతులు బొటిక శ్రీనివాసులు, భార్య పుష్ప, కొడుకు శ్రీకాంత్​గా గుర్తించామని చెప్పారు. బెంగళూరు నుంచి చుంచులూరులో ఓ వివాహానికి హాజరయ్యేందుకు వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుందని పేర్కొన్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉందని చెప్పారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. మృతదేహాలను పోస్ట్​మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని పోలీసులు వెల్లడించారు. రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందడంతో చుంచులూరు గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.