రైతు సమస్యలపై చర్చకు పట్టుబడితే సభను వాయిదా వేశారు : టీడీపీ ఎమ్మెల్సీలు - TDP MLCs Allegations on Jagan
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/07-02-2024/640-480-20688335-thumbnail-16x9-tdp-mlcs-on-jagan.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 7, 2024, 1:02 PM IST
TDP MLCs Allegations on YCP Govt: రైతాంగ సమస్యలపై అసెంబ్లీలో తాము చర్చకు పట్టుబడితే మండలి చైర్మన్ సభను వాయిదా వేశారని తెలుగుదేశం ఎమ్మెల్సీలు మండిపడ్డారు. ధాన్యం కొనుగోళ్లు కూడా చేయలేని అసమర్థ ప్రభుత్వం ఇదని విమర్శించారు. తెలంగాణలో 1.31 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు జరిగిందని అన్నపూర్ణ అని పిలిచే ఏపీలో తెలంగాణలో కొనుగోలు చేసిన ధాన్యంలో సగం కూడా లేదని దుయ్యబట్టారు. ఏపీలో 49.54 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు జరిగిందన్నారు.
ప్రభుత్వానికి జే ట్యాక్స్ కడితేనే ధాన్యం దిగుమతి అయ్యే పరిస్థితి ఉందని ఎమ్మెల్సీలు ఆరోపించారు. మిల్లుల వద్దే అన్నపానీయాలు లేకుండా రైతులు వేచి చూసే పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు భరోసా కేంద్రాలు కాదు రైతు భక్షక కేంద్రాలంటూ మండిపడ్డారు. ఇటీవల 10 ప్రకృతి విపత్తుల్లో 80 లక్షల ఎకరాల పంట నష్టపోయిందని, ప్రకృతి విపత్తుల వల్ల రైతులు 30 వేల కోట్లు నష్టపోయారన్నారు. సహకార సంఘ డెయిరీల అభివృద్ధి మానేసి గుజరాత్ కంపెనీలను తీసుకొచ్చారని ఎమ్మెల్సీలు విమర్శించారు.