thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 21, 2024, 7:33 PM IST

ETV Bharat / Videos

'నా' అన్నాడంటే నాశనమే - జగన్​ తడిగుడ్డతో గొంతులు కోస్తాడు : పిల్లి మాణిక్యరావు - TDP Leader Manikya Rao on Jagan

TDP Leader Pilli Manikya Rao Allegations on CM Jagan: జగన్ రెడ్డి నా అన్నాడంటే నాశనం అనే అర్థమని టీడీపీ అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యరావు (TDP spokesperson Pilli Manikya Rao) విమర్శించారు. నా బీసీ, నా ఎస్సీ, నా ఎస్టీ, నా మైనారిటీ అంటూనే 1.30 లక్షల కోట్లు దారి మళ్లించారని ఆయన ఆరోపించారు. నా బాబాయ్ అని వైఎస్ వివేకాను హత్య (YS Viveka murder case) చేశారు, నా తల్లి, నా చెల్లి అని రోడ్డు పాలు చేశారని మండిపడ్డారు. తడి గుడ్డతో గొంతులు కోయడం జగన్ రెడ్డి నైజమని మాణిక్యరావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అధికారం అండతో ఇన్నాళ్లు అనేక అరాచకాలు చేశారని మండిపడ్డారు. జగన్​తో పాటు అతని అనుచరులు తీవ్ర స్థాయిలో  అక్రమాలు, అరాచకాలకు పాల్పడ్డారని అన్నారు. వారి అరాచకాలపై ఎవరైనా ప్రశ్నిస్తే వారిపై అన్యాయంగా దాడులు చేసి అక్రమ కేసులు పెట్టి వేధించారని మాణిక్యరావు మండిపడ్డారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.