ఆ ఇద్దరూ మాజీ మంత్రులు మతిభ్రమించి మాట్లాడుతున్నారు: బుద్దా వెంకన్న - Buddha Fires on EX YSRCP Ministers

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 13, 2024, 2:22 PM IST

thumbnail
పేర్ని నాని, గుడివాడ అమర్​నాథ్​పై బుదా వెంకన్న విమర్శలు (ETV Bharat)

Buddha Comments on EX YSRCP Ministers : మాజీ మంత్రులు పేర్ని నాని, గుడివాడ అమర్​నాథ్ చేసిన​ వ్యాఖ్యలపై, టీడీపీ నేత బుద్దా వెంకన్నమండిపడ్డారు. వారిద్దరూ​ మతిభ్రమించి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకరేమో కోడిగుడ్ల మీద ఈకలు తొలగిస్తారని వ్యంగాస్త్రాలు సంధించారు. మరొకరు ఏమో మచిలీపట్నంలో అత్యధిక మెజార్టీతో ఓడించారని ఎద్దేవా చేశారు. కానీ ప్రజలు తిరస్కరించినా వీళ్లు మాత్రం ముఖ్యమంత్రి చంద్రబాబుపై విమర్శలు చేస్తున్నారని దుయ్యబట్టారు. విజయవాడలో ఏర్పాటు చేసిన ఓ మీడియా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.

ఓవైపు అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్​గా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్​ని మార్చారని, కానీ జగన్​మోహన్ రెడ్డి మాత్రం అప్పుల  ఏపీగా మార్చినట్లు బుద్దా వెెంకన్న ఆరోపించారు. ఆరు అడుగుల నిజాయితీకి చంద్రబాబు నిదర్శనమైతే, ఐదు అడుగుల తాచుపాము జగన్ అని విమర్శించారు. మాజీ మంత్రులు అబద్ధాలు ఆడేందుకైనా ఒక అర్థం పర్థం ఉండాలన్నారు. ఇకనైనా పేర్ని నాని, గుడివాడ అమర్​నాథ్ బుద్ధి తెచ్చుకోవాలని బుద్దా వెంకన్న హితవు పలికారు.  

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.