మహిళతో సంబంధమే అమర్నాథ్​రెడ్డి హత్యకు కారణం- ఎస్పీ మాధవరెడ్డి - Amarnath Reddy murder Case - AMARNATH REDDY MURDER CASE

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 27, 2024, 4:01 PM IST

Amarnath Reddy Murder Case : శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం కుటాలపల్లిలో ఈ నెల 24న  దుద్దుకుంటా అమర్నాథ్ రెడ్డి అనే రైతును పొలంలో నిద్రిస్తున్న సమయంలో వేట కొడవళ్లతో దారుణంగా నరికి హతమార్చారు. ఈ హత్య పుట్టపర్తి నియోజకవర్గంలో తీవ్ర దుమారం రేపుతోంది. ఈ కేసును పోలీసులు చేధించారు. జిల్లా ఎస్పీ మాధవరెడ్డి తన కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. 

ఎస్పీ మాధవరెడ్డి మాట్లాడుతూ మృతుడు దుద్దుకుంటా అమర్నాథ్ రెడ్డిని హత్య చేసిన నిందితులను పట్టుకున్నామని తెలిపారు. ఈ హత్యకు గల కారణాలను వివరిస్తూ మృతుడు ఒక మహిళతో సహజీవనం చేస్తున్నాడని, ఇది సహించలేక అదే గ్రామానికి చెందిన దుద్దుకుంటా శ్రీనివాసరెడ్డి, అతని అనుచరులు కలిసి పథకం ప్రకారం మామిడి తోటలో నిద్రిస్తున్న అమర్నాథ్ రెడ్డిని దారుణంగా నరికి చంపేశారని తెలిపారు. హత్యకు కారణమైన నలుగురు నిందితులను కోర్టులో హాజరు పరుస్తామని పేర్కొన్నారు. ఈ కేసులో నిందితులను అదుపులోకి తీసుకున్న డీఎస్పీ వాసుదేవన్, నల్లమడ సీఐ రాజేంద్రనాథ్ యాదవ్, ఎస్ఐలను, పోలీసు సిబ్బందిని ఎస్పీ ప్రశంసించారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.