జగన్​ బస్సుయాత్రలో అడుగడుగునా నిబంధనల ఉల్లంఘన- ప్రేక్షక పాత్రలో పోలీసులు - Rules Violated By YSRCP Party

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 13, 2024, 5:27 PM IST

thumbnail

Rules Violated By YSRCP Party at Mangalagiri: మేమంతా దాడులు చేయడానికి సిద్దం. మేమంతా నిబంధనలు ఉల్లంఘించడానికి సిద్దం. మేమంతా ప్రజలను బురిడీ కొట్టించడానికి సిద్ధం. ఇదీ జగనన్న స్లోగన్. ప్రతిపక్ష నేతలు చేస్తే తప్పు. జగనన్న చేస్తే ఒప్పు. పోలీసులు కూడా జగనన్నకు వంతపాడుతూ జేజేలు కొడుతున్నారు. జగన్ నిర్వహించిన బస్సు యాత్రలో అడుగడుగునా నిబంధనలు ఉల్లంఘించినా పోలీసులు కనీసం కన్నెత్తి చూడలేదు. 

గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో ముఖ్యమంత్రి జగన్ నిర్వహించిన బస్సు యాత్రలో అడుగడుగునా నిబంధనలు ఉల్లంఘించారు. టోల్ గేట్ వద్ద జగన్ వాహన శ్రేణితో పాటు వందల సంఖ్యలో వాహనాలు రావడంతో దాదాపు 10 నిమిషాల పాటు మరో వాహనం జాతీయ రహదారిపై రాలేకపోయింది. దీంతో గుంటూరు నుంచి విజయవాడకు వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గత ఏడాది పవన్ కల్యాణ్ వాహనంపై ఎక్కి కొంత దూరం ప్రయాణం చేసినందుకు తాడేపల్లి పోలీసులు జనసేనానిపై కేసు నమోదు చేశారు. ఈరోజు వైఎస్సార్సీపీ నాయకులు వాహనాలపై ఎక్కి నినాదాలు చేసినా పోలీసులు పట్టించుకోకపోవడంపై పెద్ద ఎత్తున విమర్శలొస్తున్నాయి.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.