గ్యాస్ గోడౌన్​ సమీపంలో డీజిల్ ట్యాంకర్‌లో మంటలు - అసలు ఏం జరిగిందంటే? - lorry Fire accident

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 16, 2024, 8:20 PM IST

thumbnail
గ్యాస్ గోదాము సమీపంలో డీజిల్ ట్యాంకర్‌లో మంటలు - అసలు ఏం జరిగిందంటే? (ETV Bharat)

Lorry Fire Accident in YSR District : వైఎస్సార్ జిల్లాలో ఓ లారీలో మంటలు చెలరేగడం స్థానికంగా కలకలం రేపింది. సిద్ధవటం మండలం మాధవరం గ్రామ శివార్లలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ముద్దనూరు నుంచి చెన్నైకి లారీ ఇసుక లోడుతో వెళ్తోంది. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు డీజిల్ ట్యాంకర్​లో మంటలు చెలరేగాయి. దీంతో లారీ డ్రైవర్ అప్రమత్తం అయ్యారు. ఈ క్రమంలో డ్రైవర్ లారీని మాధవరం వద్ద రహదారి పక్కన ఆపి తాను దిగిపోయాడు.

కొంతసేపటికే మంటలు లారీ మొత్తం వ్యాపించాయి. ప్రమాదం జరిగిన సమీపంలోనే గ్యాస్ గోదాం ఉండటంతో స్థానికులు ఎవరు వెళ్లడానికి సాహించలేదు. ఈ క్రమంలోనే స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వారు సంఘటన స్థలానికి చేరుకుని ఎగిసిపడుతున్న మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదం వల్ల కడప-చెన్నై జాతీయ రహదారిపై భారీగా రాకపోకలు నిలిచిపోయాయి. ఈ విషయం తెలుసుకుని సిద్ధవటం ఎస్ఐ, ఒంటిమిట్ట సీఐ సంఘటన స్థలానికి చేరుకుని ప్రమాదం జరగడానికి కారణాలను డ్రైవర్ ను అడిగి తెలుసుకున్నారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.  

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.