క్రమశిక్షణ పేరుతో ప్రిన్సిపల్ గుంజీలు - 50 మంది విద్యార్థినులకు అస్వస్థత - Principal Punishment to Students - PRINCIPAL PUNISHMENT TO STUDENTS
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 16, 2024, 7:16 PM IST
Principal Punishment to Students in Rampachodavaram : అజ్ఞానమనే అంధకారాన్ని పారద్రోలి, విజ్ఞానమనే వెలుగును నింపేవారే ఉపాధ్యాయుడు. అందుకే వారికి పురాణాలు సైతం పెద్దపీట వేశాయి. విద్యార్థులు తప్పు చేస్తే ఓ అమ్మలాగా, నాన్నలాగా దండించే హక్కు వారికి ఉంది. విద్యార్థులను క్రమశిక్షణతో నడిపిస్తూ భావిభారత పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యత వారిదే. కానీ విద్యార్థులను క్రమశిక్షణ పేరుతో తీవ్ర ఇబ్బందులకు గురి చేసిన సంఘటన అల్లూరి జిల్లాలో చోటు చేసుకుంది.
రంపచోడవరం గిరిజన గురుకుల కళాశాలల్లో దాదాపు 50 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వీరిని రంపచోడవరం ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే మిరియాల శిరీష దేవి విద్యార్థులను పరామర్శించారు. కళాశాలకు వెళ్లి అస్వస్థత గల కారణాలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. క్రమశిక్షణ పేరుతో తమ ప్రిన్సిపల్ గుంజీలు తీయించారని విద్యార్థులు ఆరోపించారు. ఏకధాటిగా 200 గుంజీలు తీయడంతో తాము అస్వస్థతకు గురయ్యామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఘటనపై విచారణ జరపాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు.