LIVE : బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో గణతంత్ర వేడుకలు
Published : Jan 26, 2024, 9:10 AM IST
|Updated : Jan 26, 2024, 9:28 AM IST
Republic Day Celebrations Live : రాష్ట్రవ్యాప్తంగా 75వ గణతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. పలు ప్రాంతాల్లో ప్రభుత్వ కార్యాలయాలు, చారిత్రక కట్టడాలు అంగరంగ వైభవంగా ముస్తాబు చేశారు. విద్యాసంస్థలు, అన్ని పార్టీ కార్యాలయాలు, ప్రభుత్వ, ప్రైవేట్ ఆఫీసుల్లో గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. దేశ ప్రజలకు గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన నేతలు అంబేడ్కర్ రచించిన రాజ్యాంగం ప్రపంచానికే ఆదర్శంగా నిలిచిందని వ్యాఖ్యానించారు. లౌకికత్వం, సమానత్వమే రాజ్యంగం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ప్రపంచంలోనే అత్యుత్తమమైన రాజ్యాంగాన్ని రూపొందించి భారత దేశానికి అందించిన దార్శనికులకు ఈ శుభప్రదమైన రోజు అని చెప్పారు. అంబేడ్కర్ రచించిన రాజ్యాంగం ప్రజలకు ఒక భరోసా అని పాలకులకు మార్గనిర్దేశమని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ రాజ్యాంగాన్ని గౌరవిస్తూ బాధ్యతగల పౌరుడిగా మెలగాలని సూచించారు. రాజ్యాంగ స్ఫూర్తితో భారతదేశాన్ని ప్రపంచ దేశాలకు ధీటుగా నిలబెట్టిందని అన్నారు. తాజాగా హైదరాబాద్ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు.