'పుంగనూరులో మీ అరాచకాలు గుర్తులేవా? - Tdp Punganur Incharge fire on MP - TDP PUNGANUR INCHARGE FIRE ON MP
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 30, 2024, 10:24 PM IST
Punganur TDP Incharge fire on MP Mithun Reddy : ఎంపీ మిథున్ రెడ్డి తనపై ఆరోపణలు చేయటం హాస్యాస్పదంగా ఉందని పుంగనూరు టీడీపీ ఇన్ ఛార్జ్ చల్లా బాబు అన్నారు. మిథున్ రెడ్డిని అడ్డుకోవాల్సిన అవసరం తెలుగుదేశం కార్యకర్తలకు లేదన్నారు. హౌస్ అరెస్ట్ నేపథ్యంలో మిథున్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై చల్లబాబు స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, గతంలో అధికారాన్ని అడ్డుపెట్టుకొని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పుంగనూరు నియోజకవర్గంలో చేసిన అరాచకాలు గుర్తులేవా అని ప్రశ్నించారు?. కావలంటే మీ కుటుంబ అరాచక దృశ్యాలను పంపుతానని, వాటిని చూసిన తర్వాత తమపై ఆరోపణలు చేయాలని సూచించారు.
అధికార అండతో టీడీపీ కార్యకర్తల పై పెట్టిన కేసులు గుర్తులేవా అని ప్రశ్నించారు?. తన పైన ఎన్ని చార్జీ షీట్లు వేశారో, తమ కార్యకర్తలు ఎన్ని రోజులు అజ్ఞాతంలో గడిపారో తెలియదా? అని నిలదీశారు. నియోజకవర్గంలో పర్యటిస్తుండగా తనను ఎన్ని ఇబ్బందులకు గురిచేశారో ఒకసారి మీ నాన్న గారిని అడిగి తెలుసుకోవాలని మిథన్ రెడ్డికి సూచించారు. గతంలో మీరు చేసిన పాపాలు, అకృత్యాలకు సంబంధించిన బాధిత కుటుంబాలే ఇప్పుడు మిమ్మల్ని అడ్డకుంటున్నాయని చల్లా బాబు ఎద్దేవా చేశారు.