వైఎస్ షర్మిల వాహన కాన్వాయ్ను అడ్డుకున్న పోలీసులు - రోడ్డుపై బైఠాయించిన కాంగ్రెస్ శ్రేణులు - AP Police
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/21-01-2024/640-480-20560962-thumbnail-16x9-police-stopped-ys-sharmila-convoy.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 21, 2024, 4:33 PM IST
Police Stopped YS Sharmila Convoy: విజయవాడ విమానాశ్రయం నుంచి కానూరుకు ప్రదర్శనగా వెళ్తున్న క్రమంలో వైఎస్ షర్మిల వాహన కాన్వాయ్ను పోలీసులు అడ్డుకున్నారు. ఎనికేపాడు వద్ద వాహనాలను పోలీసులు మళ్లించారు. దీంతో పోలీసుల తీరుకు నిరసనగా కాంగ్రెస్ నేతలు రహదారిపై బైఠాయించారు. కాన్వాయ్ను అడ్డుకున్నందుకు బందర్ రోడ్డులో మరోసారి కాంగ్రెస్ శ్రేణుల ధర్నా చేశారు.
అంతకుముందు విమానాశ్రయంలో కార్యకర్తలు, నాయకులు షర్మిలకు ఘన స్వాగతం పలికారు. ఆమెతో పాటు పార్టీ సీనియర్ నేతలు పొన్నా రజిని, కేవీపీ రామచంద్రరావు, రఘువీరారెడ్డి, తులసి రెడ్డి, శైలజనాథ్ కడప నుంచి వచ్చారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలిగా కానూరులోని కల్యాణ మండపంలో షర్మిల బాధ్యతలు చేపట్టారు.
షర్మిల కాన్వాయ్కు ఎలాంటి ఆటకం కలగలేదు: షర్మిల కాన్వాయ్ అడ్డగింతపై విజయవాడ సీపీ కాంతిరాణా స్పందించారు. షర్మిల కాన్వాయ్కు ఎలాంటి ఆటకం కలగలేదని, భారీగా ఒకేసారి వాహనాలు వెళితే ట్రాఫిక్కు ఇబ్బందులు అని తెలిపారు. షర్మిల వాహనంతో పాటు కొన్ని వాహనాలను పంపామన్న విజయవాడ సీపీ, ఉద్దేశపూర్వకంగా కాన్వాయ్ ఆపారనడంలో అర్థం లేదన్నారు.