thumbnail

ఎర్రచందనం స్మగ్లింగ్‌ ముఠాలో అటవీ సిబ్బంది- 1500 కిలోల దుంగలు స్వాధీనం - Red Sandalwood Seize

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 24, 2024, 7:13 PM IST

Police Seized Was Transporting Red Sandalwood Logs : నెల్లూరు జిల్లా మర్రిపాడు అటవీ ప్రాంతంలో అక్రమంగా ఎర్రచందనం తరలిస్తూ పట్టుబడిన వారిలో ఇద్దరు అటవీశాఖ సిబ్బందిగా పోలీసులు వెల్లడించారు. మంగళవారం రాత్రి వైఎస్సార్ జిల్లా గోపవరం మండలం పీపీ కుంట చెక్‌పోస్ట్‌ వద్ద ఎర్రచందనం తరలిస్తున్న నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లారీలో దుంగలను తరలిస్తుండగా వాటిని పట్టుకోవడం జరిగిందన్నారు. నిందితుల వద్ద నుంచి సూమారు 1500 కేజీల బరువు ఉన్న 59 దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ సుమారు 20 లక్షల రూపాయలు ఉంటుందని పేర్కొన్నారు. 

ఈ వ్యవహారంలో నలుగురు వ్యక్తులతోపాటు రెండు ద్విచక్ర వాహనాలు, ఒక గూడ్స్‌ బండిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరో ముగ్గురు వ్యక్తులు పరారయ్యారని వారి కోసం గాలిస్తున్నామని తెలిపారు. నలుగురు నిందితులతోపాటు వాహనాలను సైతం పోలీసులు కోర్టుకు తరలించారు. ఎవరైనా ఎర్రచందనం దుంగలను అక్రమంగా నరికినా, రవాణా చేసినా వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని మైదుకూరు డీఎస్పీ వెంకటేశ్వర్లు హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.