ఉచిత ఇసుక అమలులోకి వచ్చినా ఆగని అక్రమ ఇసుక తరలింపు - Police Seized Illegal Sand Lorries
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg?imwidth=128)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 11, 2024, 6:56 PM IST
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11-07-2024/640-480-21925855-thumbnail-16x9-police-seized-sand-lorries.jpg)
Police Seized 7 Illegal Sand Lorries in East Godavari District: ప్రభుత్వం కొత్త ఇసుక విధానాన్ని అమలులోనికి తెచ్చినప్పటికీ అక్రమార్కులు మాత్రం తమ పంథాను మార్చుకోవడం లేదు. అర్ధరాత్రి ఎలాంటి అనుమతులు లేకుండా బిల్లులు లేకుండా ఇసుక అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు. అలానే తూర్పు గోదావరి జిల్లాలో ఇసుక అక్రమ రవాణా ఆగడం లేదు. అక్రమార్కులు ఇసుకను అధికారుల కళ్లు కప్పి తరలిస్తూనే ఉన్నారు. వివరాల్లోకి వెళ్తే నిడదవోలు ఎస్ఈబీ (Special Enforcement Bureau) అధికారులు అక్రమంగా తరలిస్తున్న 7 లారీల ఇసుకను పట్టుకున్నారు. గోపాలపురం ఇసుక రీచ్ నుంచి ఏడు లారీల్లో సుమారు 150 టన్నుల ఇసుకను ఎటువంటి అనుమతులు, బిల్లులు లేకుండా అక్రమంగా తరలిస్తున్నారు. విశ్వసనీయంగా వచ్చిన సమాచారంతో ఎస్ఈబీ అధికారులు పెరవలి వద్ద తనిఖీలు నిర్వహించి లారీలలో తరలిస్తున్న ఇసుకను పట్టుకున్నారు. ఎటువంటి అనుమతులు లేకుండా బిల్లులు లేకుండా తరలిస్తుండడంతో ఇసుకను లారీలను స్వాధీనం పట్టుకున్నామని నిడదవోలు ఎస్ఈబీ సీఐ దొరబాబు వివరించారు.