తిరుపతి జిల్లాలో పోలీసుల అత్యుత్సాహం - టీడీపీ శిబిరంపై దాడి - Police attack on TDP camp - POLICE ATTACK ON TDP CAMP
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13-05-2024/640-480-21458914-thumbnail-16x9-police-attack-on-telugu-desam-party-camp.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : May 13, 2024, 5:01 PM IST
Police Attack on Telugu Desam Party Camp : ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ ప్రక్రియ కొనసాగుతున్న వేళ పలుచోట్ల ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. కొన్నిచోట్ల పోలింగ్ రోజున కూడా పోలీసులు వైఎస్సార్సీపీ నేతలకు కొమ్ముకాసున్నారు. తాజాగా తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం కొవ్వకుల్లిలో పోలీసుల అత్యుత్సాహం చూపించారు. కొవ్వకుల్లిలో తెలుగుదేశం పార్టీ శిబిరంపై పోలీసులు దాడి చేశారు. పోలింగ్ కేంద్రానికి వంద మీటర్ల వెలుపల ఉన్న శిబిరంపై ఎస్సై ప్రతాప్ దాడికి పాల్పడ్డారని ఆ పార్టీ నాయకులు ఆరోపించారు. శిబిరంలో కుర్చీలను ధ్వంసం చేయడంతో పాటు పలువురి కార్యకర్తలపై లాఠీచార్జి చేశారు. దీంతో కార్యకర్తలు పోలీస్ వాహనాన్ని అడ్డుకుని నిరసనకు దిగారు.
అదేవిధంగా ఏపీలో లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలకు ప్రస్తుతం పోలింగ్ జరుగుతున్న వేళ పలు ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. పలు ప్రాంతాల్లో టీడీపీ నాయకులపై దాడులకు తెగబడ్డారు. మరి కొన్నిచోట్ల టీడీపీ ఏజెంట్లపై దాడి చేసి, వారిని కిడ్నాప్ చేశారు. వారి వాహనాలను ధ్వంసం చేశారు. మరికోన్ని చోట్ల ఈవీఎంలు ధ్వంసం చేసి వైఎస్సార్సీపీ నేతలు విధ్వంసాన్ని సృష్టించారు.