మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డితో షర్మిల భేటీ - సీనియర్లందరికీ పార్టీలోకి ఆహ్వానం! - Sharmila Invites DL Ravindra Reddy
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 29, 2024, 5:34 PM IST
PCC President Sharmila Meet Former Minister DL Ravindra Reddy : కడప జిల్లా ఖాజీపేటలో మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డితో పీసీసీ అధ్యక్షురాలు షర్మిల భేటీ అయ్యారు. డీఎల్ రవీంద్రారెడ్డి, షర్మిల మధ్య అరగంట పాటు చర్చలు సాగాయి. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిమాణాలు, భవిష్యత్తులో ఎన్నికల కార్యాచరణ గురించి చర్చించినట్లు తెలుస్తోంది. కొద్ది సమయం వ్యక్తిగత విషయాల గురించి ప్రస్తావించినట్లు విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం అందింది.
Sharmila Invites DL Ravindra Reddy to Congress : వైఎస్ షర్మిల పీసీసీ అధ్యక్షురాలుగా బాధ్యత చేపట్టిన తర్వాత మొదటిసారిగా రవీంద్రారెడ్డి నివాసానికి వెళ్లడంతో ఆయన సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగానే డీఎల్ రవీంద్రారెడ్డిని కాంగ్రెస్లోకి ఆహ్వానిస్తున్నట్లు షర్మిల చెప్పారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ సీనియర్లందరినీ పార్టీలోకి తిరిగి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ భేటీలో ఏపీసీసీ మీడియా సెల్ చైర్మన్ తులసి రెడ్డితో పాటు ప్రముఖ నేతలు పాల్లొన్నారు.