ఎంబీబీఎస్, బీడీఎస్లో సీట్ల భర్తీకి నోటిఫికేషన్ జారీ: ఎన్టీఆర్ హెల్త్వర్సిటీ రిజిస్ట్రార్ - MBBS SEATS COUNSELLING IN AP - MBBS SEATS COUNSELLING IN AP
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/09-08-2024/640-480-22167613-thumbnail-16x9-ntr-health-university-registrar-interview.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 9, 2024, 7:46 PM IST
NTR Health University Registrar on MBBS Seats Counselling: వైద్య విద్య సీట్ల భర్తీకీ డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈనెల 9 నుంచి 16వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు విద్యార్ధులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా 35 కళాశాలల్లో 6 వేల 210 వైద్య విద్య సీట్లను భర్తీ చేయనున్నారు. ఈ ఏడాది అన్ని వైద్య కళాశాలల్లో ఈడబ్ల్యూఎస్ కోటా అమలు చేస్తామని అధికారులు చెబుతున్నారు. అక్టోబర్ 1 నాటికి ప్రవేశాల ప్రక్రియ పూర్తి చేస్తామని ఎన్టీఆర్ హెల్త్వర్సిటీ రిజిస్ట్రార్ రాధికారెడ్డి తెలిపారు. 3 విడతల్లో కౌన్సెలింగ్ నిర్వహిస్తామన్నారు.
ఎంబీబీఎస్ 'ఏ' కేటగిరీ కింద 3 వేల 856 సీట్లు భర్తీ చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1,540 బీడీఎస్ సీట్లు భర్తీ చేస్తున్నామన్నారు. గతంలో ఉస్మానియా యూనివర్శిటీకి ఇచ్చిన 36 శాతం సీట్లను ఈసారి ఏయూ, ఎస్వీయూ రీజియన్స్కు కేటాయిస్తున్నారు. సీట్ల కోసం విద్యార్థులు దళారులను ఆశ్రయించవద్దని కోరారు. కౌన్సిలింగ్ సజావుగా జరిపేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని చెబుతున్న డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ రిజిస్ట్రార్ డాక్టర్ రాధికా రెడ్డితో మాప్రతినిధి జయప్రకాష్ ముఖాముఖి.