నారా లోకేశ్ యువగళానికి ఏడాది పూర్తి - టీడీపీ కార్యాలయంలో వేడుకలు - TDP
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/27-01-2024/640-480-20604359-thumbnail-16x9-yuvagalam-padayatra-one-year-completion-celebrations.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 27, 2024, 6:16 PM IST
Yuvagalam Padayatra One Year Completion Celebrations: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పాదయాత్ర ప్రారంభించి సంవత్సరం అయిన సందర్భంగా తెలుగుదేశం కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో వేడుకలు జరిగాయి. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. గత ఏడాది జనవరి 27వ తేదీన కుప్పం వరదరాజు స్వామి గుడి వద్ద నారా లోకేశ్ పాదయాత్ర ప్రారంభించారు.
11 ఉమ్మడి జిల్లాలు, 97 అసెంబ్లీ నియోజకవర్గాలు, 232 మండలాలు, మున్సిపాలిటీలు, 2 వేల 28 గ్రామాల మీదుగా 226 రోజుల పాదయాత్ర చేశారు. లోకేశ్ మొత్తం 3 వేల 132 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. వైసీపీ ప్రభుత్వం పోలీసుల్ని ప్రయోగించి, అవరోధాలు సృష్టించి, అక్రమ కేసులు పెట్టి చాలా ఇబ్బందులు పెట్టినా మొక్కవోని దీక్షతో లోకేశ్ ముందుకు సాగారు. యువగళం పాదయాత్ర ద్వారా ప్రజలతో మమేకమై, వారి కష్టాల తెలుసుకుని, కన్నీళ్లు తుడుచేందుకు జనవరి 27వ తేదీన నారా లోకేశ్ ప్రజాక్షేత్రంలోకి వచ్చాడని టీడీపీ నేతలు పేర్కొన్నారు.