By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 8, 2024, 11:02 AM IST
|Updated : Mar 8, 2024, 11:34 AM IST
Live: మొదటిసారి ఓటు వేయనున్న యువతతో భువనేశ్వరి ముఖాముఖి - ప్రత్యక్ష ప్రసారం
Nara Bhuvaneshwari Interact With First Time Voters Live : తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్టుతో తీవ్ర మనోవేదనకు గురై మృతి చెందిన వారి కుటుంబాలకు నారా భువనేశ్వరి అండగా నిలుస్తున్నారు. గత కొన్ని రోజులుగా "నిజం గెలవాలి" కార్యక్రమంతో భువనేశ్వరి ప్రజల్లోకి వెళ్తున్నారు. బాధిత కుటుంబాలను పరామర్శించి వారి యోగక్షేమాలు తెలుసుకుని ఓదార్చుతున్నారు. ఎవ్వరూ అదైర్యపడోద్దని, బాధిత కుటుంబాలకు టీడీపీ అండగా ఉంటుందని హామీ ఇస్తున్నారు.'నిజం గెలవాలి' (Nijam Gelavali) యాత్రలో భాగంగా ఈరోజు అనంతపురం జిల్లాలో నారా భువనేశ్వరి పర్యటించారు. చంద్రబాబు అరెస్టుతో మనస్థాపం చెంది మృతి చెందిన వారి కుటుంబాలను ఆమె పరామర్శించారు. గుత్తి మండలం ధర్మపురానికి చెందిన ఆంజనేయులు, భేతాపల్లి నివాసితులు జయమ్మ కుటుంబ సభ్యులను భువనేశ్వరి పరామర్శించారు. ఒక్కొక్క కుటుంబానికి 3 లక్షల రూపాయలు చెక్కును భువనేశ్వరి అందించారు. పార్టీకి సేవ చేసిన వారి కుటుంబాలకు తెలుగుదేశం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భువనేశ్వరి భరోసా ఇచ్చారు. అందులో భాగంగా పత్తికొండ నియోజకవర్గంలో మొదటిసారి ఓటు వేయనున్న యువతతో భువనేశ్వరి ముఖాముఖి అయ్యారు. ప్రత్యక్ష ప్రసారం మీ కోసం
Last Updated : Mar 8, 2024, 11:34 AM IST