నంద్యాల వైసీపీ నుంచి టీడీపీలోకి భారీగా బలిజ కులస్తుల చేరికలు - YCP Leader Joined In TDP - YCP LEADER JOINED IN TDP
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 14, 2024, 5:52 PM IST
YCP Leader Joined In TDP Party: నంద్యాల జిల్లాలో వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీకి చేరికల జోరు పెరిగింది. గత కొంత కాలంగా వైసీపీ వెన్నంటి ఉన్న కార్యకర్తలు ఒక్కొక్కరుగా తెలుగుదేశం వైపు చూస్తున్నారు. పార్టీలో తమకు సరైన గౌరవం, మర్యాద లేదంటూ పార్టీని వీడుతున్నారు. ఏ పార్టీకైనా కార్యకర్తలే మూల స్తంభాల్లా పని చేస్తారు. అలాంటి కార్యకర్తలు ఎన్నికల వేళ ఎటువైపు మెుగ్గు చూపితే ఆ పార్టీ అధికారం చేజిక్కించుకుంటుందనే విషయం తెలిసిందే. తాజాగా నంద్యాలలో సైతం వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి భారీ స్థాయిలో చేరికలు మెుదలయ్యాయి. వైసీపీ తీరు నచ్చక బలిజ సంఘానికి చెందిన పలువురు నాయకులు నేడు టీడీపీలో చేరారు. నంద్యాల తెలుగుదేశం అభ్యర్థి ఎన్ఎండీ. ఫరూక్, నంద్యాల పార్లమెంటు అభ్యర్థి బైరెడ్డి శబరి, మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర రెడ్డిలు వారికి కండువా కప్పి తెలుగుదేశంలోకి ఆహ్వానించారు. త్వరలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని నేతలు ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఫరూక్ దేవుడి దయవల్ల రోడ్డు ప్రమాదం నుంచి బతికి బయట పడ్డానని, అందరూ ఓటు వేసి తనను దీవించాలని కోరారు.