మున్సిపల్ కార్పొరేషన్ బడ్జెట్ సమావేశంలో బీజేపీ కార్పొరేటర్లు, మేయర్కు మధ్య రగడ
Published : Feb 22, 2024, 7:12 PM IST
Municipal Budget Meeting In Nizamabad : నిజామాబాద్ నగర మున్సిపల్ కార్పొరేషన్ ఆఖరి బడ్జెట్ సమావేశంలో (Final Budget Meeting Of Municipal Corporation) రసాభాస చోటుచేసుకుంది. మేయర్ నీతూ కిరణ్ ఈ సమావేశానికి మీడియాను అనుమతి ఇవ్వకపోవడంతో బీజేపీ కార్పొరేటర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. తమ సమస్యలు ప్రజలకు తెలియాలంటే మీడియాకు తప్పనిసరిగా అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. అసలు మీడియాకు అనుమతి ఎలా ఉందో చెప్పాలని మేయర్ను ప్రశ్నించారు. మీడియా లోపలికి వచ్చే వరకు సమావేశం జరగనిచ్చేది లేదంటూ సభ్యుల నిలబడి నిరసన వ్యక్తం చేశారు.
Nizamabad Municipal Budget Meeting : బీజేపీ, ఎంఐఎం సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది. మొదటిసారిగా కార్పొరేషన్ బడ్జెట్ సమావేశానికి అర్బన్ ఎమ్మెల్యే సూర్యనారాయణ, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ హాజరయ్యారు. మీడియా అనుమతిపై ఎమ్మెల్యే సూర్యనారాయణ, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ మాట్లాడుతూ వచ్చే సమావేశంలో మీడియాకు అనుమతి చేసే విధంగా ఓటింగ్ నిర్వహిస్తామని తెలిపారు.