thumbnail

మున్సిపల్ కార్పొరేషన్ బడ్జెట్ సమావేశంలో బీజేపీ కార్పొరేటర్లు, మేయర్​కు మధ్య రగడ

By ETV Bharat Telangana Team

Published : Feb 22, 2024, 7:12 PM IST

Municipal Budget Meeting In Nizamabad : నిజామాబాద్ నగర మున్సిపల్ కార్పొరేషన్ ఆఖరి బడ్జెట్ సమావేశంలో (Final Budget Meeting Of Municipal Corporation) రసాభాస చోటుచేసుకుంది. మేయర్ నీతూ కిరణ్ ఈ సమావేశానికి మీడియాను అనుమతి ఇవ్వకపోవడంతో బీజేపీ కార్పొరేటర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. తమ సమస్యలు ప్రజలకు తెలియాలంటే మీడియాకు తప్పనిసరిగా అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. అసలు మీడియాకు అనుమతి ఎలా ఉందో చెప్పాలని మేయర్​ను ప్రశ్నించారు. మీడియా లోపలికి వచ్చే వరకు సమావేశం జరగనిచ్చేది లేదంటూ సభ్యుల నిలబడి నిరసన వ్యక్తం చేశారు.

Nizamabad Municipal Budget Meeting : బీజేపీ, ఎంఐఎం సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది. మొదటిసారిగా కార్పొరేషన్ బడ్జెట్ సమావేశానికి అర్బన్ ఎమ్మెల్యే సూర్యనారాయణ, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ హాజరయ్యారు. మీడియా అనుమతిపై ఎమ్మెల్యే సూర్యనారాయణ, ఎమ్మెల్సీ మహేశ్​ కుమార్ మాట్లాడుతూ వచ్చే సమావేశంలో మీడియాకు అనుమతి చేసే విధంగా ఓటింగ్ నిర్వహిస్తామని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.