యథా సీఎం తథా మంత్రులు- జగన్ పాలనలో సెక్రటేరియట్ దుస్థితిపై లోకేశ్ విసుర్లు - Lokesh on Secretariat Maintenance

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 24, 2024, 7:46 PM IST

thumbnail
Lokesh_Comments_on_Secretariat_Maintenance (ETV Bharat)

Lokesh Comments on Secretariat Maintenance: మంత్రిగా నారా లోకేశ్‌ ఐటీ, విద్యా, ఆర్టీజీ శాఖల బాధ్యతలు స్వీకరించారు. సచివాలయం నాలుగో బ్లాక్​లోని తన ఛాంబర్​లో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆయన బాధ్యతలు చేపట్టారు. బాధ్యతలు స్వీకరించిన వెంటనే సచివాలయం నిర్వహణపై లోకేశ్​ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తన ఛాంబర్​తో పాటు సచివాలయంలో గదులు నిర్వహణ సరిగా లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తంచేశారు. గత ప్రభుత్వంలో మంత్రులు సెక్రటేరియట్​కు వచ్చే వారా అంటూ లోకేశ్​ అధికారులను అడిగారు. 

మంత్రులు సెక్రటేరియట్​లో అందుబాటులో ఉండేవారు కాదని అధికారులు చెప్పారు. జగనే సచివాలయానికి రానప్పుడు మంత్రులు ఎలా వస్తారులే అని నారా లోకేశ్ వ్యాఖ్యానించారు. క్యాబినెట్ మీటింగ్​కు వచ్చినా అటెండెన్స్ రిజిస్టర్​లో సంతకం పెట్టి వెళ్లడమే కదా అని లోకేశ్​ అన్నారు. సెక్రటేరియట్ నిర్వహణకు కేటాయించిన నిధులు కూడా లేవని ఉద్యోగులు చెప్పారు. ఆ నిధులు వేరే అవసరాలకు మళ్లించి ఉంటారని మంత్రి నారా లోకేశ్​ అన్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.