'ఎస్సీల సంక్షేమాన్ని జగన్ విస్మరించారు'- కూటమికి సంపూర్ణ మద్దతు ప్రకటించిన మందకృష్ణ మాదిగ - Manda Krishna Madiga Fires YSRCP - MANDA KRISHNA MADIGA FIRES YSRCP
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/03-05-2024/640-480-21375380-thumbnail-16x9-manda-krishna-madiga-fires-on-ysrcp-government.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : May 3, 2024, 12:57 PM IST
Manda Krishna Madiga Fires on YSRCP Government : 2019కి ముందు ఉన్న ఎస్సీల సంక్షేమాలను సీఎం జగన్ నిర్వీర్యం చేశారని ఎమ్మార్పీఎస్ (MRPS) వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రకాశం జిల్లా కనిగిరిలో ఆయన భారీ బహిరంగ సభ నిర్వహించారు. కార్యక్రమంలో కూటమి అసెంబ్లీ అభ్యర్థి ఉగ్ర నరసింహారెడ్డితో పాటు MRPS కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సీఎం జగన్ అధికారం మాటున రాష్ట్ర సంపదను దోచుకున్నారని మందకృష్ణ ఆరోపించారు. మాదిగల భవిష్యత్తు తరాల బాగుకోసం కూటమికి తమ సంపూర్ణ మద్దతు తెలియజేశారు.
ఎస్సీ వర్గీకరణకు ఏమాత్రం మద్దతు ఇవ్వని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఎట్టి పరిస్థితుల్లో తమ మద్దతు ఉండదని తెలిపారు. వైఎస్సార్సీపీకి డిపాజిట్లు కూడా లేకుండా చేసేందుకు మాదిగలంతా ఏకం కావాలని ఆయన పిలుపునిచ్చారు. జగన్ జైలులో ఉన్నప్పుడు వైఎస్సార్సీపీకి ప్రాణం పోసి నిలబెట్టిన తల్లి విజయమ్మ విదేశాలకు పోగా.. చెల్లి షర్మిల ఊరూరా తిరుగుతూ అన్న మోసకారి జగనన్నకు ఓటు వేయవద్దు అంటూ ప్రచారం చేస్తుంటే మరి మాదిగలు జగన్ రెడ్డికి ఎందుకు ఓట్లు వేయాలని ప్రశ్నించారు. జగన్ రెడ్డి జైలుకు వెళ్లకుండా ఉండేందుకా? అధికారం మాటున రాష్ట్ర సంపదను దోచుకునేందుకా? అంటూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై తీవ్రస్థాయిలో మండిపడ్డాడు.