పోలవరంలో మళ్లీ చిరుత కలకలం - భయాందోళనకు గురవుతున్న ప్రజలు - Leopard Migration in Polavaram

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 3, 2024, 10:45 PM IST

thumbnail
పోలవరంలో మళ్లీ చిరుత కలకలం - భయాందోళనకు గురవుతున్న ప్రజలు (ETV Bharat)

Leopard Migration in Polavaram Agency: ఏలూరు జిల్లా పోలవరం ఏజన్సీ గ్రామంలో చిరుత మళ్లీ మరో మేకపై దాడి చేసి చంపడంతో ఏజన్సీ గ్రామాల గిరిజనుల్లో భయాందోళనలు మొదలయ్యాయి. అటవీ క్షేత్రాధికారి దావీదురాజు తెలిపిన వివరాల ప్రకారం పోలవరం మండలం వింజరం పంచాయతీ సున్నాలగండి గ్రామ సమీపంలో అడవిలో మడకం పుల్లారావు అనే మేకల కాపరికి చెందిన మేకపై మంగళవారం రాత్రి చిరుత దాడి చేసి చంపిందని తెలిపారు. బాధితుడు పుల్లారావు ఇచ్చిన సమాచారం మేరకు సంఘటనా ప్రాంతానికి వెళ్లి మేక కళేబరాన్ని పరిశీలించామన్నారు. పశు వైద్యాధికారితో పరీక్షలు నిర్వహించి ఆ ప్రాంతంలో పాదముద్రలు సేకరించామని తెలిపారు. సమీప గ్రామాల్లో చిరుత సంచారంపై అటవీశాఖ సిబ్బందితో అవగాహన కల్పిస్తున్నామని అన్నారు. ఒంటరిగా అడవుల్లోకి వెళ్లి పశువులను మేపరాదని, పంటపొలాల్లో వంగి పనులు చేసేటప్పుడు పరిసరాలు గమనిస్తూ ఉండాలని సూచించినట్లు తెలిపారు. కట్టెలు ఇతర అవసరాలకు అడవుల్లో సంచరించవద్దని, ఆరుబయట పడుకోవడం లాంటివి చేయరాదని అటవీ క్షేత్రాధికారి సూచించినట్లు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.