చివరి రోజు బారాషాహిద్‌ దర్గాకు పోటెత్తిన భక్తులు - కోరికల రొట్టె కోసం పోటీ - Rottela Panduga in Last Day

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 21, 2024, 5:12 PM IST

thumbnail
చివరి రోజు బారాషాహిద్‌ దర్గాకు పోటెత్తిన భక్తులు - కోరికల రొట్టె పట్టుకునేందుకు పోటీపడ్డ జనం (ETV Bharat)

Last Day of Rottela Festival Celebrations: నెల్లూరులోని బారాషాహిద్‌ దర్గా రొట్టెల పండుగ నిర్వహణ చివరి రోజు కావడంతో భక్తజనం పోటెత్తారు. బారాషాహీదుల దర్శనానికి భక్తులు బారులు తీరారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. దీంతో దర్గా ప్రాంగణమంతా రద్దీగా మారింది. స్వర్ణాల చెరువులో పుణ్యస్నానాలు చేసిన అనంతరం కోరికల రొట్టెలు పంచుకున్నారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి కుటుంబ సమేతంగా బారాషాహిదులను దర్శించుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం కుటుంబసభ్యలతో కలిసి స్వర్ణాల చెరువులో కోరికల రొట్టె పట్టుకున్నారు. 

ఐదు రోజుల ఈ రొట్టెల పండుగ నేటీతో ముగుస్తుండటంతో బారాషాహీద్‌లకు గలేఫ్‌లు, పూల చద్దర్లు సమర్పించి భక్తులు మొక్కులు తీర్చుకున్నారు. భక్తులతో స్వర్ణాల చెరువు ఘాట్, దర్గా ఆవరణలో సందడి నెలకొంది. మరోవైపు కోరికల రొట్టెలు పట్టుకునేందుకు భక్తులు పోటీపడ్డారు. ఈ రొట్టెల పండుగ 17న ప్రారంభమైంది. మొత్తం 5 వేల మంది భద్రతా సిబ్బంది రొట్టెల పండుగ విధుల్లో పాల్గొన్నారు. భద్రతా విధుల్లో 2 వేల మంది పోలీసులను అధికారులు నియమించారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.