thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 22, 2024, 3:26 PM IST

ETV Bharat / Videos

ట్రిపుల్‌ ఐటీ కాలేజీల్లో ప్రాంభమైన అడ్మిషన్ల ప్రక్రియ- కనీస సౌకర్యాలు లేవని తల్లిదండ్రుల మండిపాటు - Nujiveedu IIIT College

Lack of Facilities in Admissions Counseling in Nujiveedu IIIT College : ఏలూరు జిల్లా నూజివీడు, కడప జిల్లా ఇడుపులపాయలోని ట్రిపుల్​ ఐటీ కళాశాల్లో అడ్మిషన్ల  కౌన్సింగ్​ ప్రక్రియ ప్రారంభమయ్యింది. ఇవాళ, రేపు ఎంపికైన విద్యార్థులకు కౌన్సిలింగ్ ప్రక్రియ ఉంటుందని ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ కుమారస్వామి గుప్తా తెలిపారు. ఒంగోలు ట్రిపుల్‌ ఐటీకి సంబంధించి ఈ నెల 24, 25 వ తేదీలలో ఆర్కే వ్యాలీలో అడ్మిషన్ ప్రక్రియ ఉంటుందని తెలిపారు 

 కౌన్సింగ్​కు హజరై వారికి కనీస అవసరాలు ఏర్పాటు చేయలేదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అడ్మిషన్ల కోసం కౌన్సింగ్​ నిర్వహించారు కానీ కనీసం కూర్చోవడానికి ఎలాంటి సదుపాయాలు ఏర్పాటు చేయలేదు. దీంతో విద్యార్దులు, వారి తల్లిదండ్రులు నేలపైనే కూర్చువాల్సి వచ్చింది. ఎంతో ప్రతిష్ఠాత్మకమైన ఆర్జీయూకేటీ క్యాంపస్​లో ఇలాంటి దుస్థితి ఏమిటని విద్యావేత్తలు, పలు ప్రజా సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులకు అవసరమైన ధ్రువపత్రాలను జిరాక్స్​ తీసుకోవడానికి ఒక్క షాపుకు కూడా అనుమతులు ఇవ్వకపోవడంతో వారి తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.