రామోజీరావు మృతి తమను తీవ్రంగా కలచివేసింది- కోనసీమ ప్రజలు - Konaseema People Tribute to Ramoji Rao

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 8, 2024, 5:45 PM IST

thumbnail
రామోజీరావుకు సంతాపం తెలిపిన కోనసీమ ప్రజలు (ETV Bharat)

Konaseema District People Tribute to Ramoji Rao Demise: పత్రికా రంగంలో పెను మార్పులు తీసుకొచ్చిన రామోజీరావు మృతి పట్ల కోనసీమ వాసులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. 1996 నవంబర్ 6వ తేదీన కోనసీమకు పెన్ను తుఫాను వచ్చింది. ఆ సమయంలో వందల సంఖ్యలో నివాసగృహాలు పాఠశాల భవనాలు దెబ్బతిన్నాయి. ఆ సమయంలో రామోజీ ఫౌండేషన్ ముందుకు వచ్చి కోనసీమలో పలు ప్రభుత్వ పాఠశాలలకు భవనాలు నిర్మించి వాటికి సూర్య భవనాలుగా నామకరణం చేసింది. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి. గన్నవరం మండలం ముంజవరపు కొట్టు గ్రామంలో నిర్మించిన సూర్య భవనాన్ని 1997లో రామోజీరావు ఈ గ్రామానికి వచ్చి ప్రారంభించారు ఆయన మరణంతో ఈ గ్రామస్తులు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. ఆయన మరణంతో తెలుగు మీడియా రంగం ఒక మహోన్నత వ్యక్తినీ కోల్పోయిందని అన్నారు. తెలుగు పాత్రికేయ రంగానికి, తెలుగు భాషాభివృద్ధికి ఆయన చేసిన సేవలు అమూల్యమైనవి గ్రామస్థులు కొనియాడారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.